TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. 8 రోజులపాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఈ నెల 22 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో పాల్గొనబోతున్నారు. టోక్యోలో పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఉంటారు.