రూ.200 కోట్లతో సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి ముస్తాబవుతోంది. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు కాగా.. మరో రూ.170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో సుమారు రూ.72 లక్షలు పెట్టి నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి రేవంత్ తండ్రి ఎనుముల నరసింహారెడ్డి పేరు పెట్టారు. అభివృద్ధి పనులను దసరా రోజు సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.