కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రేవంత్ దొంగలా దొరికిపోయారని BRS MLA కేపీ వివేకానంద మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు కేపీ, డాక్టర్ కే సంజయ్, అనిల్ జాదవ్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీ మాట్లాడుతూ.. 'ఈ భూముల విషయంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ తీరుకు అద్దం పట్టింది. SC తీర్పును ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో గుంటనక్కల పాత్ర ఎవరు పోషిస్తున్నారో ప్రజలకు తెలిసింది' అని విమర్శించారు.