TG: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్షలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో రైతుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. రేవంత్ 2 లక్షల రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారని.. 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందించామని తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా.. ప్రజల్ని మోసం చేసి గెలిచాడని కేటీఆర్ మండిపడ్డారు.