కుటుంబ డిజైన్ డిజిటల్ కార్డులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిజిటల్ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే సర్వేలో భాగంగా ఆ కుటుంబం ఫోటో తీయాలని చెప్పారు.