యూపీలోని ఘజియాబాద్లోని మధుబన్ బాపుధామ్ పోలీస్ స్టేషన్ వద్ద కలకలం రేగింది. పోలీసు స్టేషన్లోని లాకప్లో భారీ నాగుపాము పడగ విప్పి కూర్చుని కనిపించింది. దీంతో అధికారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నాగుపాముని అదుపులోకి తీసుకుని అడవిలో విడిచిపెట్టారు. ఆ సమయంలో లాకప్లో ఖైదీలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.