TG: సూర్యాపేట జిల్లాకు చెందిన జాటోత్ సునీల్ కుమార్ అనే ఉపాధ్యాయుడి దారుణానికి పాల్పడ్డాడు. తల్లితో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లికి చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తూ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే అతడికి హెచ్ఐవీ సోకుందని తెలియడంతో వారిపై జరుగుతున్న అకృత్యాలను తల్లికి చెప్పారు. దీంతో తల్లికూతుర్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు