AP: రాజమండ్రి తూర్పగోదావరి జిల్లా మధురపూడి ఎయిర్పోర్టులో శుక్రవారం ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మించిన టెర్మినల్లో కొంత భాగం విరిగి పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ఇటీవల ఈ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.