పాకిస్థాన్ కాల్పుల్లో ఇటీవల వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్కి చెందిన జవాన్ మురళీనాయక్ తల్లికి ప్రముఖ కమెడియన్ శివారెడ్డి పాదాభివందనం చేశారు. మురళీ స్వగ్రామమైన కళ్ళి తండాకు వెళ్లిన ఆయన, శోకంలో ఉన్న తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. "మనమింకా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం అంటే మురళీ లాంటి వీరుల త్యాగాల వల్లే" అని శివారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.