తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కలకలం కొనసాగుతుంది. డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. వర్షాకాలం వచ్చిందంటే వర్షాకాలంతో పాటు సీజనల్ రోగాలు కూడా వస్తుంటాయి. వర్షాకాలంలో దోమల బెడదతో పాటు రోగాలు పెరుగుతాయి అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుంది.