20% కమిషన్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు: కేటీఆర్ (వీడియో)

71చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వానికి 20% కమిషన్ తప్ప విజన్ లేదని కేటీఆర్ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 'భారత దేశ చరిత్రలో ఎక్కడా జరగని ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. మొదటిసారిగా తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. 20% కమిషన్ ఇవ్వకపోతే బిల్లులు చెల్లించరని ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు' అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్