ఆపరేషన్ సిందూర్లో పాల్గొంటున్న భారత సైనికులకు మద్దతుగా కర్ణాటక కాంగ్రెస్ తిరంగా యాత్ర నిర్వహించింది. బెంగళూరులోని చినస్వామి స్టేడియం వద్ద నుంచి మిన్స్క్ స్క్వేర్ వరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యం ధైర్యాన్ని ప్రశంసిస్తూ, బెంగళూరు పూర్తిగా సైన్యం వెంటే ఉందని వారు ప్రకటించారు.