TG: నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ED చార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్గాంధీ పేర్లను చేర్చింది. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్.. టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈడీ వైఖరిని నిరసిస్తూ.. రేపు ఉ.10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు.