TG: కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ సీఎం కేసీఆర్ కీలక విషయాలు తెలిపారు. క్యాబినెట్ సహా అన్ని అనుమతులు తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు KCR వెల్లడించారు. వ్యాప్కోస్ సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందన్నారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. బ్యారేజీల్లో ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారని, నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు టెక్నికల్ అంశమని వివరణ ఇచ్చారు.