TG: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు గాంధీ భవన్ ముందు ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తమను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారం చేపట్టి ఏడాదిన్నర అవుతున్న దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను తీర్చాలని, లేకపోతే ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని హెచ్చరించారు.