భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు: 011-23387089, 9871999430, 9871999053, 9871990081, 9818395787 ను అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏపీ ప్రజలకు అవసరమైన ప్రతి సాయం అందించేందుకు ఏపీ భవన్ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని CM చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.