కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టిపై కేసు నమోదైంది. ఆదివారం సూరత్కల్లో జరిగిన సభలో భరత్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి కొట్టాలి’ అని వ్యాఖ్యానించారు. దీంతో మంగళూరులోని కాంగ్రెస్ కార్పొరేటర్ అనిల్ ఫిర్యాదు మేరకు కావూరు పోలీసులు భరత్పై FIR నమోదు చేసినట్లు సీపీ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.