ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా ఓ విద్యార్థి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. పాకిస్తాన్కు మద్దతుగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేయడంతో.. గమనించిన కళాశాల సిబ్బంది, విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. కాగా భారత్కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.