రైతు భరోసా అమలు విషయంలో దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని, ఈ పథకాన్ని షరతుల్లేకుండా అమలు చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల రెండో వారం నుంచి జిల్లాలు, మండలాల వారీగా BJP తరఫున అధికారులకు వినతిపత్రాలు అందజేసి, అన్నదాతల పక్షాన నిలుస్తామని ప్రకటించారు.