భారత యువ క్రికెటర్, తెలుగు అమ్మాయి గొంగడి త్రిషకు రూ.కోటి భరీ నజరానాను సీఎం రేవంత్ ప్రకటించారు. అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో త్రిష సభ్యురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ను క్రికెటర్ త్రిష కలిశారు. ఆల్రౌండర్గా టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన త్రిషను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.