మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: నాగార్జున

75చూసినవారు
మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: నాగార్జున
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు తెలిపారు. 'నా కుటుంబంపై మంత్రి సురేఖ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో నా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. నాగ చైతన్య - సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినీరంగంలో ఉన్నవారిపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు' అని తెలిపారు. ఈ మేరకు నాగార్జున స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసుకుంది.

సంబంధిత పోస్ట్