ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసును మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో పెళ్లి అయిన 15 రోజులకే 27 ఏళ్ల మహిళ తన భర్త అనిల్ లోఖండే(53)ను గొడ్డలితో నరికి చంపేసింది. అతడిని మొదటి భార్య క్యాన్సర్తో చనిపోయింది. దీంతో రెండో వివాహం చేసుకున్నాడు. భార్యను భర్త వేధించడంతో చంపేసింది. ఈ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు MIDC పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దిలీప్ భండ్వాల్కర్ తెలిపారు.