టాలీవుడ్ నటుడు బిష్ణు అధికారికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. యూట్యూబ్లో తాము ఇచ్చిన టాస్క్లు పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని సైబర్ మోసగాళ్లు ఆయనను నమ్మించారు. వారిని నమ్మిన బిష్ణు పలు అకౌంట్లలో రూ.45 లక్షలు వేశారు. చివరికి తాను మోసపోయినట్లు బిష్ణు గ్రహించారు. దీనిపై తాజాగా ఆయన హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన స్వీయ దర్శకత్వంలో హీరోగా 'హిట్ మ్యాన్' అనే సినిమా తీశారు.