మధ్యాహ్న భోజనంలో చనిపోయిన ఊసరవెల్లి.. 65 మంది చిన్నారులకు వాంతులు

62చూసినవారు
మధ్యాహ్న భోజనంలో చనిపోయిన ఊసరవెల్లి.. 65 మంది చిన్నారులకు వాంతులు
జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన 65 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారి తిన్న ఆహారంలో చనిపోయిన ఊసరవెల్లి కనిపించింది. దీంతో చిన్నారులకు వాంతులు అయ్యాయి. వారిని టీచర్లు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్