పాక్కు మద్దతు తెలిపిన తుర్కియేపై భారత పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తుర్కియే, అజర్బైజాన్కు వెళ్లాలనుకున్న వారిలో సగం మంది టూర్లు రద్దు చేసుకున్నట్లు ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు జ్యోతి మయాల్ తెలిపారు. గతేడాది తుర్కియేకు భారత్ నుంచి రూ.400 కోట్ల టూరిజం ఆదాయం వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ దేశం పాక్ పక్షాన నిలవడంతో చాలామంది టూరిజం ఏజెంట్లు ఆ దేశాలకు సేవలు నిలిపివేశారని తెలిపారు.