ఛత్రపతి శివాజీ ఏప్రిల్ 3, 1680న మరణించారు. ఏప్రిల్ 21న రాజారామ్ను ఛత్రపతిగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న శంభాజీ పన్హాలా కోట, జూన్ 18, 1680న రాయ్గడ్ కోటను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. జులై 20న శంభాజీ ఛత్రపతిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ సమయంలో 10 ఏళ్ల రాజారాంను, అతని భార్య జానకి బాయి, సవతి తల్లి సోయారాబాయిని జైలులో పెట్టించారు. శివాజీకి విషం ఇచ్చిన ఆరోపణతో సోయారాబాయికి మరణశిక్షను విధించారు.