ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. సీఎం, హోం మంత్రి దిగ్భ్రాంతి

52చూసినవారు
AP: అనకాపల్లి(D) కోటవురట్ల(M) కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడుకు ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు ధాటికి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేలుడు సమయంలో పరిశ్రమలో 15మంది కార్మికులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాసేపట్లో క్షతగాత్రులను అనిత పరామర్శించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్