ఇండియాలో నక్సలైట్ ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో.. 1980లో కేశవరావు పీపుల్స్ వార్ గ్రూప్లో చేరి బసవరాజ్గా పేరు మార్చుకున్నారు. పీపుల్స్ వార్ గ్రూప్ ఆ తర్వాత సీపీఐ (మావోయిస్టు)గా మారింది. ఆయన గెరిల్లా యుద్ధ వ్యూహాలు, ఐఈడీల వినియోగంలో నైపుణ్యం సాధించారు. 1987లో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ, మాజీ సైనికుల వద్ద శిక్షణ పొంది గెరిల్లా యుద్ధంలో మరింత నైపుణ్యం సంపాదించారు.