శ్రీశైలం, సాగర్‌ నుంచి AP, TGకి నీళ్లు విడుదల చేయాలని నిర్ణయం

73చూసినవారు
శ్రీశైలం, సాగర్‌ నుంచి AP, TGకి నీళ్లు విడుదల చేయాలని నిర్ణయం
ఎండాకాలం దృష్ట్యా శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నుంచి ఏపీకి 4 TMCలు, తెలంగాణకు 10.26 TMCలు విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలంలో 800 అడుగులు, సాగర్‌లో 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఏపీకి సాగర్‌ కుడి కాల్వ నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చెయాలంది. శ్రీశైలంలో జులై నెలాఖరు వరకు 800 అడుగుల కనీస మట్టం కొనసాగించాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్