తమ సహనాన్ని పరీక్షించవద్దని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దానిని అలుసుగా తీసుకుంటే తీవ్ర ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ను హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిస్పందనగా భారత్లోని 15 సైనిక టార్గెట్లను ఆ దేశం లక్ష్యంగా చేసుకున్నది. అయితే భారత్ ధీటుగా బదులిచ్చింది. పాక్ దాడులను తిప్పికొట్టింది. లాహోర్లోని రాడార్, రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది’ అని రక్షణ మంత్రి అన్నారు.