త్రివిధ దళాధిపతులతో శనివారం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు సీడీఎస్ అనిల్ చౌహాన్ రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం కానున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. పాక్ దూకుడును అడ్డుకునేందుకు సమాలోచనలు చేయనున్నారు. అవసరాన్ని బట్టి స్పందించాలని ఇదివరకే అధికారులను రాజ్ నాథ్ ఆదేశించారు.