ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు, సిబ్బంది, ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య కారణాలు మినహా.. ఏ ఒక్కరికి సెలవులు మంజూరు చేయకూడదని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారి సెలవులను రద్దు చేస్తూ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సెలవుల రద్దు నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది.