IPLలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్ (51) నితీశ్ రాణా (51) అర్ధశతకాలతో రాణించినా ఆ జట్టును లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది.