దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లోకి 2024 జులై 27న చొచ్చుకొచ్చిన వరదలో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నమోదైన కేసులో భవనం బేస్మెంట్ సహ యజమానులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ‘ఇందులో ఎలాంటి అవినీతి కోణం లేదు. ఈ కేసుపై ఇప్పటికే ఛార్జిషీట్ నమోదైంది. అందుకే 2024 సెప్టెంబరు 13న వీరికి మంజూరైన మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్పు చేస్తున్నాం’ అని వెల్లడించింది.