రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి TNGOS కాలనీలో బుధవారం పలు ఇండ్లను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. సర్వే నంబరు 156/1 లోని పలు నిర్మాణాలు ఉన్న స్థలం ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే బాధితులు జేసీబీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అధికారులకు, బాధితులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.