తెలంగాణలో శాంతిభద్రతలపై సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి హైలెవల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్కు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, కమిషనర్లు సీవీ ఆనంద్, అవినాష్ మహంతి, సుధీర్ బాబు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు నిత్యం సమాచారం అందించడానికి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.