సమోసాలు, మిర్చి బజ్జీలు, పకోడీలు, పునుగులు, బోండాలు ఇవన్నీ జంక్ ఫుడ్డే. వీటిని ఎక్కువగా తింటే అధిక బరువు, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కానీ.. విదేశీ జంక్ ఫుడ్తో పోల్చితే.. ఇవి చేసే హాని కొంత తక్కువే అనుకోవాలి. మన దేశంలో ఇప్పుడు ప్యాకింగ్ చేసే జంక్ ఫుడ్ బాగా పెరిగింది. పరోటాలు, చపాతీలు, రెడీ టు ఈట్ నూడుల్స్, చిరుతిళ్లు ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇలాంటి ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేసే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే ప్రమాదమే.