ధవళేశ్వరం బ్యారేజ్.. పది లక్షల ఎకరాలకు సాగునీరు

78చూసినవారు
ధవళేశ్వరం బ్యారేజ్.. పది లక్షల ఎకరాలకు సాగునీరు
ధవళేశ్వరం పాత ఆనకట్ట వరదలతో దెబ్బతినడంతో 1970లో కొత్త బ్యారేజ్ నిర్మించారు. 1978లో ప్రస్తుతం ఉన్న బ్యారేజ్ అందుబాటులోకి వచ్చింది. 1852లో పూర్తైన ఆనకట్ట పడవ రవాణా, సాగునీటి కోసం ఉపయోగపడింది. అదనంగా సాగునీటి అవసరాల కోసం 1862-67 మధ్య ఆనకట్ట ఎత్తు రెండు అడుగుల మేర పెంచారు. 1897-99లలో సిమెంటు కాంక్రీటు వినియోగించి మరో తొమ్మిది అంగుళాలు, 1936లో మూడు అడుగుల చొప్పున ఎత్తు ఉండే తలుపులు అమర్చి, పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్