అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డు సాధించాడు. భారత్కు తొలి టీ20 ప్రపంచకప్ (2007), రెండో వన్డే ప్రపంచకప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) అందించాడు. ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్గా ధోనీ వన్డేల్లో 84 సార్లు అజేయంగా నిలిచాడు. అలాగే ధోనీ 148 క్యాచ్ అవుట్లు, 42 స్టంపింగ్లతో 190 మంది ఆటగాళ్లను పెవిలియన్కు చేర్చాడు.