ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. LSG ప్లేయర్ ఆయుష్ బదోని 22 పరుగులకు ఔటయ్యారు. జడేజా వేసిన 13.4 ఓవర్కు ధోనీ చేతిలో స్టంపౌట్ అయ్యి ఆయుష్ బదోని పెవిలియన్ చేరారు. దీంతో 14 ఓవర్లకు LSG స్కోరు 107/4 గా ఉంది. క్రీజులో పంత్ (36), అబ్దుల్ సమద్ (1) క్రీజులో ఉన్నారు.