కుంగిన ప్రాజెక్టును చూపించకుండా గత ప్రభుత్వం దాచిపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ సభలో నిన్న వాస్తవాలు చెప్పామని అన్నారు. ప్రాజెక్ట్ రీ డిజైన్ అనే బ్రహ్మపదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారని ఎద్దేవా చేశారు. ఇసుక కదిలితే ప్రాజెక్ట్ కుంగిందని బీఆర్ఎస్ చెప్తోందని.. ఇసుకలో పేకమేడలు కట్టారా అని సెటైర్లు వేశారు. మేడిగడ్డ సందర్శనకు అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానిస్తున్నామని అన్నారు.