ఢిల్లీ నుండి కత్రా వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి శాఖాహార రైలు. ఈ రైలులో మాంసాహారం, గుడ్లు వంటి చిరుతిళ్లు తీసుకురావడమూ నిషేధించబడింది. IRCTC, సాత్విక్ ఫౌండేషన్ ఒప్పందంతో ఈ రైలుకు "సాత్విక్ సర్టిఫికేషన్" లభించింది. కేవలం శాఖాహార భోజనాన్ని మాత్రమే అందించే ఈ రైలులో ప్రయాణికులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనం అందిస్తున్నారు.