పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వకుండా మీనవేషాలు లెక్కిస్తుంది మీరు కాదా? బీజేపీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. 'TGలోని 5 పంచాయతీలను ఏపీలో విలీనం చేసి భద్రాద్రి రామయ్య భూములను ఏపీకి అప్పనంగా అప్పగించింది మీరు కాదా? రూ.కోట్ల ఖర్చుతో రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నామని గొప్పలు చెప్పే మీకు.. భద్రాద్రి రాముడికి 17km దూరంలోని పాండురంగాపురం స్టేషన్ కనపడదా?' అని మండిపడ్డారు.