రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ను కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించినందుకు లక్ష్మణ్ సింగ్ను పార్టీ నుంచి 6 ఏళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. తరచూ అధినాయకత్వంపై విమర్శలు చేస్తుండటంతో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.