బీజేపీకి హిందువులు, ముస్లింలు అనే తారతమ్యం లేదని, మహిళల గౌరవం తమ పార్టీకి అత్యంత ముఖ్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అన్నారు. అందుకే ట్రిపుల్ తలాఖ్ రద్దు చేశామన్నారు. మధ్యప్రదేశ్లోని రేవా, సత్నా జిల్లాలలో పార్టీ లోక్సభ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ "24 క్యారెట్ల బంగారం" అని, కాంగ్రెస్ "తుప్పు పట్టిన ఇనుము" అని పేర్కొన్నారు.