19 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

1688చూసినవారు
19 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన
ఆర్థిక సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల్లో ఉద్యోగాల కోతలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. రాబోయే 18 నెలల పాటు ఈ ప్రక్రియ సాగుతుందని తెలిపింది. కంపెనీ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే, ఇందులో ఎంతమంది భారతీయుల ఉద్యోగాలు ప్రభావితం అవుతాయో స్పష్టత లేదు.