ఛత్రపతి జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్లో ఛత్రపతి జయంతి ఉత్సవాల్లో బ్యానర్ కడుతుండగా పలువురు యువకులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.