అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 231 మృతదేహాలను గుర్తించారు. మరికొందరి డీఎన్ఏ నమూనాలు సరిపోలడం లేదని, రక్త సంబంధీకుల నమూనాలు ఇవ్వాలని ఎనిమిది కుటుంబాలకు సూచించారు. డీఎన్ఏ సరిపోలితేనే మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేయడం, పదిరోజులు గడిచినా తమవారి మృతదేహాలు ఇంకా అందకపోవడంతో కొన్ని కుటుంబాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.