తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులకు పోలీసులు కీలక సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం ఇంకా తగ్గకపోవడంతో అటువైపు వాహనదారులు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రయాణికులను పోలీసులు కోరుతున్నారు.