AP: నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. 'పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు. 100 మందికి పైగా YCP రౌడీలు TDP కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది ప్రజలు చూసారు. కక్ష సాధింపు, కుట్రలు మీ బ్రాండ్ జగన్. అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి, ఇప్పుడు ప్రజాస్వామ్యంపై లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది' అని లోకేష్ అన్నారు.